జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 12,751 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,31,807

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 12,751 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 16,412 మంది కోలుకోగా… 42 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 1,31,807 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో పాజటివిటీ రేటు 3.50 శాతంగా, రికవరీ రేటు 98.51 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,06,88,49,775 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 31,95,034 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/